ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని వందశాతం తల్లిదండ్రులకు చేర్చాలి..ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి

కలికిరి నేస్తం న్యూస్:ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని తల్లిదండ్రులకు అందించి భాధ్యతగా విధులు నిర్వహించాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి తెలిపారు.శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ భవనంలో వాల్మీపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయ పరిధిలోని గుర్రంకొండ, కలకడ, వాల్మీపురం, కలికిరి మండలాలలో ఇటీవల ఎంపికైన 12 మంది అంగన్వాడీ కార్యకర్తలకు, సహాయకులకు ఎమ్మెల్యే నియామక పత్రాలను అందించారు.ఈ సంధర్భంగా ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నేడు నియామక పత్రాలను అందుకున్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు తమకు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని బాధ్యతతో తమ విధులను నిర్వర్తించాలని తెలిపారు. చిన్నపిల్లల పట్ల బాధ్యతగా ఉంటూ ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని వందశాతం పిల్లల తల్లిదండ్రులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మీరు బాధ్యతతో పని చేస్తే గర్భవతులు బాలింతలు, పిల్లలు మంచి ఆరోగ్యంతో ముందు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ భారతి, సూపర్వైజర్లు అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు తదితరులు పాల్గొన్నారు





Comments

Popular posts from this blog

ఐక్యరాజ్య సమితి దినోత్సవం సంధర్భంగా ప్రత్యేక కథనం